Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శాంటియాగొ : ఆదివారం చిలీ జాతీయులకు చారిత్రక దినం. మాజీ సైనిక జనరల్ అగస్టో పినొచెట్ నియంతృత్వ కాలం నాటి రాజ్యాంగాన్ని మార్చేందుకు జరిగిన అభిప్రాయ సేకరణలో మెజారిటీ ప్రజలు ఓటు వేశారు. 99.45శాతం ఓట్లు లెక్కించగా, 78.28శాతం మంది ఆ రాజ్యాంగాన్ని మార్చాలని ఆకాంక్షించగా, 21.72శాతం మంది తిరస్కరించారు. ప్రజలు ఇచ్చిన ఈ రిఫరెండమ్ తీర్పుపై దేశమంతటా ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.వందలాది మంది వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. ఆదివారం నాటి పోలింగ్లో మొత్తంగా 75,29,459మంది ప్రజలు ఓటు వేశారు. 1993 తర్వాత ఇంత పెద్దసంఖ్యలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఇదే మొదటిసారి. 155మందితో ఏర్పడిన కమిటీ కొత్త రాజ్యాంగాన్ని రూపొందిస్తుంది. ఈ క్రమం 2021లో ప్రారంభమవుతుంది. పూర్తవడానికి దాదాపు ఏడాది కాలం పడుతుంది. రాజ్యాంగంలో వుండాల్సిన అంశాలపై అంగీకారం కుదిరిన తర్వాత మళ్లీ రాజ్యాంగాన్ని ధృవీకరించే అభిప్రాయసేకరణ జరుగుతుంది. ఇందులో అందరూ ఓటింగ్ చేయడమనేది తప్పనిసరి. ఈ కమిటీలోని 155మందిలో 78మంది స్త్రీ, పురుషులెవరైనా సరే ఎన్నుకోబడతారు. దేశీయ తెగల కోసం కేటాయించిన ప్రతేక కోటాలను వారితో భర్తీ చేస్తారు.