Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్విట్జర్లాండ్ : నిబంధన మేర క్వారంటైన్కు తరలించిన వందలాది మంది బ్రిటన్ పర్యాటకులు పారిపోయిన ఘటన ఆదివారం స్విట్జర్లాండ్లో జరిగింది. బ్రిటన్లో ఇటీవల గుర్తించిన నూతన కరోనా స్ట్రెయిన్తో పలు దేశాలు అప్రమత్తమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే బ్రిటన్ నుంచి వచ్చే విమానాలపై పలు దేశాలు నిషేధం విధించడంతో పాటు అక్కడి నుండి వచ్చిన పర్యాటకులను క్వారైంటన్కు తరలిస్తున్నాయి. స్విట్జర్లాండ్ ప్రభుత్వం కూడా బ్రిటన్ పర్యాటకులను పది రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందిగా ఆదేశించింది. దీంతో ఆల్పైన్ స్టేషన్కు చేరుకున్న 420 మందిలో 200 మంది బ్రిటన్ పర్యాటకులను ప్రభుత్వం స్విస్ కీ రిసార్ట్కు క్వారంటైన్కు పంపింది. వీరంతా అక్కడి నుంచి పారిపోయినట్టు సోన్టాగ్స్ జీటింగ్ వార్తా పత్రిక వెల్లడించింది. కొంతమంది పర్యాటకులు వెంటనే తమ దేశానికి వెళ్లిపోగా, మిగిలిన వారిపై నిర్బంధం విధించినట్టు ప్రభుత్వం తెలిపింది. పర్యాటకులకు పంపిన భోజనం అలాగే ఉండిపోవడంతో.. హోటల్ నుంచి వారు పారిపోయినట్టు గుర్తించామని తెలిపింది.