Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా వైరస్ మ్యూటేషన్పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన
జెనీవా: 2019 నవంబర్లో చైనాలోని వూహాన్ నగరంలో మొదటి కేసు నమోదైనప్పటి నుంచి కనీసం నాగులు రకాల స్ట్రెయిన్లు వెలుగులోకి వచ్చాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా వెల్లడించింది. గత ఏడాది నుంచి ఇప్పటివరకూ జరిగిన కొన్ని అసాధారణ ఘటనల వెనుక ఈ కొత్త వేరియంట్లు ఉండి ఉండొచ్చని అభిప్రాయపడింది. చైనాలో తొలిసారిగా కరోనా బయటపడిన అనంతరం.. 2020 ఫిబ్రవరిలో డీ614జీ జన్యు మార్పు కలిగిన ఓ కొత్త స్ట్రెయిన్ ఉనికిలోకి వచ్చిందని తెలిపింది.
జూన్-2020 నాటికి అత్యధిక శాతం కేసులు ఈ స్ట్రెయిన్ కారణంగానే సంభవించాయని తెలిపింది. అలాగే, ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో మూడో వేరియంట్ను గుర్తించారు. డెన్మార్క్లోని నార్త్ జూట్లాండ్లో ఓ ఫామ్లో ఉన్న మింక్స్లో తొలిసారిగా గుర్తించారు. దీనికి క్లస్టర్-5 అనే పేరును పేట్టారు. దీనికి సంబంధిచి 12 కేసులను సెప్టెంబర్లో గుర్తించారు. ఈ క్లస్టర్-5 మానవుల రోగ నిరోధక శక్తిని దీటుగా ఎదుర్కొగలదన్న ఆందోళనను అప్పట్లో కొందరు శాస్త్రవేత్తలు వ్యక్తం చేసినట్టు డబ్ల్యూహెచ్వో నివేదిక పేర్కొంది. ఇక 2020 డిసెంబర్ 14న బ్రిటన్లో మరో స్ట్రెయిన్ సార్స్-కోవీ-2 వోక్2020- 202012/01 పరిశోధకులు గుర్తించారు. యూకేలో తీవ్రస్థాయిలో విజృంభించిన ఈ స్ట్రెయిన్.. డిసెంబర్ చివరి నాటికి ఇతర దేశాల్లోకి సైతం పాకింది. అయితే, అప్పటికే అక్కడున్న కరోనా వైరస్తో ఈ కొత్త స్ట్రెయిన్కు ఫైలోజెనెటిక్ సంబంధం లేదన్న విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఈ స్ట్రెయిన్ పుట్టుక ఓ చిక్కుముడిగా మారింది. అయితే యూకేకు చెందిన స్ట్రెయిన్ కారణంగా వ్యాధి తీవ్రతలో ఎటువంటి మార్పు రాలేదు కానీ వైరస్ వ్యాప్తిలో వేగం మాత్రమే పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు.