Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండోనేషియా విమాన ప్రమాద ఘటనలో పురోగతి
- జావా సముద్రంలో శరీర భాగాలు, దుస్తులు స్వాధీనం
- ప్రమాద కారణంపై ఇంకా రాని స్పష్టత
జకార్తా : ఇండోనేషియా విమాన ప్రమాద ఘటనలో అక్కడి అధికారులు కొంత పురోగతి సాధించారు. ప్రమాదానికి గురైన విమానానికి చెందిన రెండు బ్లాక్ బాక్సుల జాడ లభ్యమైనట్టు ఆ దేశ జాతీయ రవాణా భద్రత కమిటీ చీఫ్ సూర్జాంటో తజ్జాంటో ఆదివారం వెల్లడించారు. విమానం అదృశ్యమైన అనంతరం దాదాపు ఒక రోజంతా గాలింపు చర్యల అనంతరం వీటి జాడ దొరికినట్టు చెప్పారు. బాక్స్లను త్వరలో తెరిచి ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తామని మిలటరీ చీఫ్ హాది తజ్జాంటో పేర్కొన్నారు. మరోవైపు జావా సముద్రంలో శరీర భాగాలు, దుస్తులు, కొన్ని లోహపు శకలాలను రెస్క్యూ సిబ్బంది స్వాధీనం చేసుకు న్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. ఈ శరీర భాగాలు విమాన ప్రయాణికులకు చెందినవిగా అధికారులు అనుమానిస్తున్నారు. శరీరాలను గుర్తించేందుకు కుటుంబసభ్యులు తమవారి డెంటల్ రికార్డులు, డీఎన్ఏ నమూనాలు ఇవ్వాలని పోలీసులు కోరారు. అయితే విమాన ప్రమాదానికి కారణంపై అధికారులు ఇంకా ఒక స్పష్టతకు రాలేదు. సాంకేతిక లోపంతో జరిగిం దా లేక మరేదైనా కారణం ఉందా అన్నది తేలాల్సి వుంది. ఇండోనేషియా రాజ ధాని జకార్తా నుంచి శనివారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో బయలు దేరిన శ్రీవిజయ విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో సిబ్బందితో సహా మొత్తం 62 మంది చనిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రమాదంపై ఇండోనేషియా అధ్యక్షుడు జొకొ విడొడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శరీర భాగాలు, దుస్తులు, లభ్యం..
కాగా, విమాన ఆచూకీ కోసం శనివారం మొదలుపెట్టిన గాలింపులో ఆదివారం ఉదయం నాటికి కొంత పురోగతి కనిపించింది. జావా సముద్రంలో శరీర భాగాలు, దుస్తులు, కొన్ని లోహపు శకలాలను రెస్క్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు. విమానం కూలిన ప్రదేశాన్ని కచ్చితంగా కనుగొనేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇండోనేషియా రవాణా శాఖ మంత్రి బుది కార్య సుమధి తెలిపారు. శరీర భాగాలు, దస్తులు, శకలాలను ఎస్ఎఆర్ బృందం లాంకాంగ్, లఖి ద్వీపాల మధ్య కనుగొందని నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీకి చెందిన బాగస్ పురోహితో పేర్కొన్నారు.