Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెనిజులా : కోవిడ్-19 కోరలు చాచి ప్రజలను హడలెత్తిస్తున్న వేళ బ్రెజిల్కు వెనిజులా ఆపన్నహస్తం అందిస్తున్నది. ఆ దేశంలోని ఒక రాష్ట్రమైన అమెజోనాస్కు అవసరమైన ఆక్సిజన్ ట్యాంకులను వెనిజుల ప్రభుత్వం పంపిస్తున్నది. వెనిజుల దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నది. కాగా ఈ విషయాన్ని అమెజోనాస్ ఫెడరల్ డిప్యూటీ జోస్ రికార్డో ధృవీకరించారు. ఆ రాష్ట్ర గవర్నర్ విల్సన్ లీమా కూడా ఈ విషయంలో వెనిజులా ప్రభుత్వానికి సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఆక్సిజన్ వినియోగం దేశంలో 130 శాతం పెరిగిందని విల్సన్ లీమా వెల్లడించారు. బ్రెజిల్లో రోజురోజుకూ పెరిగిపోతున్న కరోనా కేసులు అక్కడ తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నాయి. డిమాండ్కు తగిన ఆక్సిజన్ సిలిండర్లు, ఐసీయూ బెడ్లు అందుబాటులో లేకపోవడం పరిస్థితి తీవ్రమయ్యేలా చేస్తున్నది.