Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రటిక్ నేత జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేపట్టిన అనంతర ప్లాన్ను వైట్హౌస్కు కాబోయే చీఫ్ ఆఫ్ స్టాఫ్ రోన్ క్లెయిన్ శనివారం ఒక మెమో ద్వారా వెల్లడించినట్టు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి 10 రోజుల పాటు డజన్ల కొద్దీ కార్యనిర్వాహక ఆదేశాలు ఇస్తూ వైట్హౌస్లోని ఓవర్ కార్యాలయంలోనే గడపాలని బైడెన్ యోచిస్తున్నట్టు తెలిపింది. మొదటి రోజున.. పలు మెజార్టీ ముస్లిం దేశాలకు ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన ప్రయాణ నిషేధాన్ని ఉపసంహరించు కోనున్నారని సమాచారం. అదేవిధంగా పారిస్ వాతావరణ ఒప్పందంలో తిరిగి చేరడం, విద్యార్థుల లోన్ పేమెంట్లపై నిర్ణయం తీసుకోనున్నారు. కోవిడ్-19 ఆంక్షలను విస్తరించడం, అంతర్రాష్ట్ర ప్రయాణాలకు మాస్కును తప్పనిసరి చేయడం, అమెరికా-మెక్సికో సరిహద్దును దాటిన చిన్నారులకు తిరిగి వారి కుటుంబాల వద్దకు చేర్చడంపై చర్చలు చేపట్టనున్నారు. అదేవిధంగా ముఖ్యంగా 1.1 కోట్ల మందికి పౌరసత్వానికి మార్గం కల్పించే కాంగ్రెస్ ఇమ్మిగ్రేషన్ చట్టాన్ని పంపనున్నారని సమాచారం. ఈనెల 20న బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.
సైన్స్ టీంను ప్రకటించిన బైడెన్
సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ కార్యాలయానికి చెందిన సభ్యులను బైడెన్ శనివారం అధికారికంగా ప్రకటించారు. ఈబృందానికి బైడెన్ నామినేట్ చేసిన ఎరిక్ లాండర్ నాయకత్వం వహించనున్నారు. అదే విధంగా ఆయన అధ్యక్షుడికి సాంకేతిక సలహాదారుగా ఉండనున్నారు. జన్యుశాస్త్రంలో ఎరిక్ ల్యాండర్ నిపుణుడు. అదేవిధంగా ఆయన బ్రాడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంఐటి అండ్ హార్వార్డ్కు అధ్యక్షుడిగా, వ్యవస్థాపక డైరెక్టర్గా ఉన్నారు. గతంలో ఒబామా పాలనా యంత్రాంగానికి సలహాదారుగా కూడా పనిచేశారు.