Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిటన్ ఉక్కిరి బిక్కిరి
లండన్ : కొత్త, పాత కోవిడ్ 19 వైరస్లతో బ్రిటన్ ఉక్కిరి బిక్కిరవుతోంది. గత 24 గంటల్లోనే ఆ దేశంలో 1,610 మంది కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 2020లో కరోనా మొదలైన తర్వాత దేశంలో ఒకేరోజు ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించడం ఇదే ప్రథమం. దేశంలో ఇప్పటివరకు 91,470 మంది ఈ వైరస్ బారిన పడి చనిపోయారు. గత 24 గంటల్లో 33,355 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత వారంతో పోల్చుకుంటే కరోనా బారినపడిన వారి సంఖ్య కొంత తగ్గింది. ఇప్పటి వరకు మొత్తంగా 35 లక్షల మంది మంది కోవిడ్ బారినపడ్డారు. ప్రస్తుతం బ్రిటన్లో మూడో దశ కరోనా వైరస్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఇంగ్లాండ్లో డిసెంబర్లో 12 శాతం మంది, నవంబర్లో తొమ్మిదిశాతం మంది కోవిడ్ బారిన పడ్డారని గణాంకాలు చెబుతున్నాయి.