Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యూహెచ్వోతోనూ బంధం కొనసాగింపు..!
- పలు కీలక నిర్ణయాలు తీసుకున్న బైడెన్
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే జో బైడెన్ పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వాటికి సంబం ధించిన ఉత్తర్వులను సైతం జారీ చేశారు. వాటిల్లో ఇమ్మిగ్రెషన్, వాతారణ మార్పులు (పారిస్ ఒప్పందం), కరోనా మహమ్మారి, ప్రపంచ ఆరోగ్య సంస్థ లో భాగం కావడం వంటి పలు కీలక అంశాలు ఉన్నాయి. వాటిల్లో గత అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను నిలిపేసినవే ఉండటం గమనార్హం. మొదటగా దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిపై పోరుకు సిద్ధమై... దానికి అనుగుణంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. వెంటనే టీకా అందని ప్రజలందరికి వ్యాక్సిన్ అందించే ఏర్పాట్లను ముమ్మరం చేయడంతో పాటు, పౌరులందరూ తప్పనిసరిగా మరో 100 రోజుల పాటు మాస్కు ధరించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, కోవిడ్-19 చికిత్సకు ఉపయోగించే పరికరాలను సరిపడా అందుబాటులోకి ఉంచాలని తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఆ సంస్థ నుంచి వైదొలిగిన అమెరికా.. తిరిగి మళ్లీ చేరింది. అలాగే, పర్యావరణ ఒప్పందమైన పారిస్ ఒప్పందంలో తిరిగి చేరుతున్నామంటూ.. ట్రంప్ తీసుకున్న దాదాపు 100కు పైగా నిర్ణయాలను నిలిపివేస్తూ ఉత్తర్వులను బైడెన్ జారీ చేశారు. ఆర్థిక సంస్థల రుణాలు, చెల్లింపులు మొదలైన వాటిపై మారటోరియం మార్చి 31 దాకా పొడిగించారు. వడ్డీ, విద్యార్థి రుణాల చెల్లింపులు సెప్టెంబర్ 30 దాకా నిలిపివేస్తూ నోటీసులు జారీ చేశారు. వర్ణ సమానత్వానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. పనిచేసే ప్రదేశాల్లో లింగ సమానత్వం తప్పనిసరిగా ఉండాలని ఉత్తర్వులిచ్చారు. అమెరికా చరిత్రలో నల్లజాతీయుల పాత్రపై పరిశోధనకు ఏర్పాటు చేసిన వివాదాస్పదమైన ''1776 కమిషన్''ను రద్దు చేశారు. ఇప్పటివరకూ కొనసాగిన ఏడు ముస్లిం దేశాల పౌరుల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు.