Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్ల్యూహెచ్ఓ నిర్ణయం
లండన్: కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో ఏవైనా దుష్పరిణామాలు కనిపిస్తే నష్టపరిహారం చెల్లించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, డబ్ల్యూహెచ్ఓ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం'కోవాక్స్' ద్వారా వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే ఈ పరిహారం ఇవ్వనున్నారు. ప్రపంచవ్యాప్తంగా 92 పేద దేశాల్లోని ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా డబ్ల్యూహెచ్ఓ కరోనా వ్యాక్సిన్ అందిస్తోంది. ఈ దేశాల జాబితాలో ఆఫ్రికా, ఆగేయ ఆసియాకు చెందిన దేశాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి.
ఆ దేశాల ప్రజలకు మాత్రమే ఈ పరిహారం అందనున్నది. అయితే, డబ్ల్యూహెచ్ఓ తీసుకున్న నిర్ణయం ఇతర దేశాల వ్యాక్సినేషన్ కార్యక్రమాల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.