Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టెహరాన్ : ఇరాన్ చమురు ట్యాంకర్ వెనిజులాకు చేరుకుంది. 4.4 కోట్ల లక్షల లీటర్ల గ్యాసోలిన్ను తీసుకుని ఇరాన్ చమురు ట్యాంకర్ ఎల్ పాలిటో హార్బర్కు చేరుకుందని ఇరాన్ మీడియా సోమవారం తెలిపింది. ట్యాంకర్ ట్రాకర్స్ వెబ్సైట్ ఆధారంగా చేసుకుని చమురు ట్యాంకర్ విజయవంతంగా ఓడ రేవుకు చేరిందనీ, చమురును దిగుమతి చేసిందని మెహర్ వార్తా సంస్థ తెలిపింది. ఆరు వారాల క్రితం ఈ ట్యాంకర్ ఇరాన్ ఓడరేవు నుంచి బయలుదేరింది. గతేడాది మే 24, 25ల్లో రెండు ట్యాంకర్లు చేరుకున్న తర్వాత ఇది మూడవది. పై రెండు ట్యాంకర్లకు వెనిజులా నేవీ ఎస్కార్ట్గా వచ్చింది. అమెరికా ఆంక్షలను సవాలు చేస్తూ ఈ ట్యాంకర్లు చమురును దిగుమతి చేశాయి. వెనిజులాకు ఎలాంటి వాణ్యిపరమైన బదిలీలు జరగకుండా అడ్డుకునేందుకు కరేబియన్ సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు మోహరించి వున్నాయి. అంతర్జాతీయ జలాల్లో తమ ట్యాంకర్లపై దాడులు జరిగితే తాము కూడా అమెరికాపై కూడా అవే చర్యలు తీసకుంటామని ఇరాన్ హెచ్చరించింది.