Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సైన్యంపై చర్యలకు మయన్మార్ రాయబారి విజ్ఞప్తి
యాంగాన్ : శనివారం యాంగాన్ నగరంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు మయన్మార్ పోలీసులు రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. అయితే వారు కేవలం రబ్బర్ బుల్లెట్లు మాత్రమే ఉపయోగిం చారా లేదా తూటాలు కూడా ప్రయోగించారా అనేది తెలియరాలేదు. దీంతో మయాంగోన్ జంక్షన్ వద్ద శుక్రవారం గంటల తరబడి ఉధృక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలావుండగా, సైనిక పాలకులపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఐక్యరాజ్య సమితిలో మయన్మార్ రాయబారి విజ్ఞప్తి చేశారు. దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఈ నెల 1వ తేదీన సైన్యం కూలదోసినప్పటినుండి ప్రజాస్వామ్య అనుకూల నిరసనలతో దేశం యావత్తూ అట్టుడికిపోతోంది. శనివారం మాన్ జాతీయ దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని వందలాది మంది మాన్ ఆందోళనకారులు గుమిగూడారు. జాతిపరంగా ఇతర మైనారిటీ గ్రూపులు కూడా వీరితో చేతులు కలిపాయి. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు జర్నలిస్టులు, ఆందోళనకారులను వెంటాడారు. ముగ్గురు జర్నలిస్టులను నిర్బంధంలోకి తీసుకున్నారు. పోలీసులు నియంతను కాపాడుతున్నారంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. వెంటనే వారందరూ చిన్నచిన్న వీధుల్లోకి వెళ్లిపోయి, పోలీసులను నిలువరించేందుకు బారికేడ్లు, ముళ్ల కంచెలు, టేబుళ్లను అడ్డం పెట్టారు. ఇతర రీతుల్లో ఆందోళన నిర్వహించేందుకు కూడా ఆలోచిస్తున్నామని వారు తెలిపారు.c