Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అబుజ: నైజీరియాలో గత 10 రోజుల క్రితం ఒక పాఠశాల నుంచి కిడ్నాపయిన 42 మంది బందీలకు విముక్తి లభించింది. వీరిలో 27 మంది చిన్నారులు కూడా ఉన్నారు. కగర ప్రభుత్వ సైన్స్ కాలేజ్ నుంచి కిడ్నాప్ అయిన విద్యార్థులు, సిబ్బంది, బంధువులకు మళ్లీ స్వేచ్ఛ లభించిందని, నైజర్ ప్రభుత్వం వారిని ఆదుకుందని నైజెర్ రాష్ట్ర గవర్నర్ అబుబకర్ సాని బెల్లో శనివారం ట్వీట్ చేశారు. పది రోజుల క్రితం సైనిక దస్తులతో వచ్చిన సాయుధులు కాలేజీపై కాల్పులు జరిపి, ఒక విద్యార్థిని హత్య చేసి ఈ 42 మందిని కిడ్నాప్ చేశారు. మరోవైపు శుక్రవారం జంఫర రాష్ట్రంలో జంగెబ్ గ్రామంలో ప్రభుత్వ బాలికల సైన్స్ పాఠశాలపై ఒక గ్యాంగ్ దాడి చేసి 300 మందికి పైగా బాలికలను ఎత్తుకెళ్లింది. గత మూడు నెలల వ్యవధిలో దేశంలో ఇలాంటి ఘటన జరగడం ఇది మూడో సారి. 317 బాలికలను రక్షించడం కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.