Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బైడెన్కు రిపబ్లికన్ సెనేటర్ల లేఖ
వాషింగ్టన్ : కోవిడ్ వ్యాక్సిన్ వ్యతిరేక పేటెంట్లను రద్దు చేయాలని ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఒ)కు భారత్, దక్షిణాఫ్రికా దేశాలు చేసిన ప్రతిపాదనను ఆమోదించవద్దని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు నలుగురు రిపబ్లికన్ సెనేటర్లు కోరారు. మేధోసంపత్తికి సంబంధించి అన్ని హక్కులను రద్దు చేయడం వలన ఆవిష్కరణల కొనసాగింపునకు అడ్డంకిగా మారుతుందని, కరోనా వైరస్లో వస్తున్న కొత్త వేరియంట్లను నియంత్రించేందుకు కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధి నిలిచిపోయేలా చేస్తుందని సెనేటర్లు అన్నారు. ఈ రిపబ్లికన్ పార్టీకి చెందిన మైక్ లీ, టామ్ కాటన్, జోని ఎర్నెస్ట్, టోడ్ యంగ్లు శుక్రవారం బైడెన్కు తాజాగా ఒక లేఖ రాశారు. డబ్ల్యుటిఒలో చర్చకు రానున్న ప్రతిపాదనను తిరస్కరించాని ఈ సందర్భంగా వారు కోరారు. కోవిడ్-19 సంబంధిత నూతన ఆవిష్కరణల మేధో సంపత్తి హక్కులను రద్దు చేయాలని కోరుతూ భారత్, దక్షిణాఫ్రికా, ఇతర దేశాలు ప్రతిపాదించాయని సెనేటర్లు పేర్కొన్నారు. అమెరికా కంపెనీలు అభివృద్ధి చేసిన ఆవిష్కరణల హక్కులను నాశనం చేస్తే.. తమకు కోవిడ్-19 వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసే తయారీదారులు ఎక్కువగా ఉంటారని ఆయా దేశాలు వాదిస్తున్నాయని తమ లేఖలో అన్నారు. అమెరికా కంపెనీల హక్కులను నిలుపుదల చేస్తే తమకు లబ్ధి చేకూరుతుందని కొన్ని దేశాలు అనుకుంటున్నాయని, ఇది తప్పు అని సెనేటర్లు చెప్పుకొచ్చారు.