Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఈ నెల30న జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
  • తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
  • నేడు ఆత్మకూరు ఉపఎన్నిక ఫలితాలు
  • భూపాలపల్లి అటవీప్రాంతంలో పెద్దపులి సంచారం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
శ్రీలంక రణరంగం | ప్రపంచం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • ప్రపంచం
  • ➲
  • స్టోరి

శ్రీలంక రణరంగం

Tue 10 May 05:18:26.336204 2022

- ప్రధాని మహింద రాజపక్స రాజీనామా నిరసనకారులపై
- అధికార పార్టీ ఎంపీ కాల్పులు
- ఆ తర్వాత జరిగిన ఘర్షణలో అధికార పార్టీ ఎంపీ మృతి
- అధ్యక్షుడు గోటబయ కూడా రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్‌
- నిరసనకారులకు, ప్రభుత్వ మద్దతుదారులకు మధ్య దాడులు
- 78మందికి తీవ్రగాయాలు
కొలంబో : శ్రీలంకలో పరిస్థితి చేయిదాటిపోయింది. ప్రధాని మహింద రాజపక్స మద్దతుదారులు, నిరసనకారులకు మధ్య పరస్పర దాడులతో సోమవారం దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రధాని పదవికి రాజీనామా చేస్తున్నా..నిరసనకారులు శాంతించాలని మహింద రాజపక్స కోరినా ఉద్రిక్త పరిస్థితిలో మార్పు రాలేదు. దాంతో పోలీసులు దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు. రాజీనామా చేస్తున్నానని ఆయన ప్రకటించిన కొద్ది గంటల్లోనే దేశంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. అధ్యక్షుడు గోటబయకు ప్రధాని తన రాజీనామా లేఖను సమర్పించారు. అలాగే మంత్రివర్గంలో ఇద్దరు మంత్రులు కూడా రాజీనామా సమర్పించారు.
              సోమవారం రాజపక్సే మద్దతుదారులు నిరసనకారులను కర్రలతో చితకబాదారు. పోలీసులు నిరసనకారులపై టియర్‌గ్యాస్‌, జల ఫిరంగులు ప్రయోగించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈక్రమంలో అధికార పార్టీకి చెందిన ఎంపీ అమరకీర్తి అత్తుకోరల నిరసనకారులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో ఆగ్రహానికి లోనైన నిరసనకారులు ఆయన కారును అడ్డగించారు. ఈక్రమంలో అక్కడ జరిగిన ఘర్షణల్లో అమరకీర్తి మృతిచెందినట్టు లంక మీడయా తెలిపింది.
              ఏప్రిల్‌ 9 నుంచి అధ్యక్ష కార్యాలయం వెలుపల నిరసన తెలుపుతోన్న వారిపై రాజపక్స విధేయులు సోమవారం కర్రలతో దాడికి దిగినట్టు సమాచారం. నిరసనకారులు ఏర్పాటు చేసుకున్న టెంట్లు, ఇతర నిర్మాణాలను ధ్వంసం చేయడానికి యత్నించడంతో వారిని అదుపులోకి తెచ్చేందుకు..పోలీసులు టియర్‌గ్యాస్‌, జల ఫిరంగులు ప్రయోగించారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన శ్రీలంక ప్రధాని మహీంద రాజకపక్స..ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. సంక్షోభ నివారణకు ఆర్థిక పరిష్కారం అవసరమని, ఈ దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.
              మే 6న కేబినెట్‌ ప్రత్యేక సమావేశంలో అధ్యక్షుడు గోటబయ దేశంలో అత్యవసర పరిస్థితి విధించారు. తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో ఒకనెల వ్యవధిలో రెండుమార్లు అత్యవసర పరిస్థితి విధించటంతో నిరసనలు మిన్నంటాయి. వేలాది మంది నిరసనకారులు గోటబయ అధికార నివాసం ముందు గుమికూడి నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ప్రధాని రాజపక్స, అధ్యక్షుడు గోట బయ తమ పదవులకు రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాం డ్‌ చేస్తున్నారు. దేశంలో కొనసాగుతున్న సంక్షోభానికి తన రాజీనామా ఒక్కటే పరిష్కారం అయితే, అందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని రాజపక్స వెల్లడించారు. ఆహార, ఇంధన, ఔషధాల కొరతతోపాటు విదేశీ మారకద్రవ్యాల నిల్వలు కరిగిపోతుండటంతో శ్రీలంక అల్లాడుతోంది. ఇప్పటికే విదేశీ రుణాలను డీఫాల్ట్‌గా ప్రకటించిన శ్రీలంక, మొత్తం 51 బిలియన్‌ డాలర్ల (మనదేశ కరెన్సీలో సుమారుగా రూ.4లక్షల కోట్లు) విదేశీ రుణాలను చెల్లించలేమని పేర్కొంది. సాయం కోసం పొరుగు దేశాలవైపు చూస్తోంది. భారత్‌ తన ఆపన్నహస్తాన్ని అందించి, క్లిష్ట సమయంలో తనవంతు సాయం చేస్తోంది.
రంగంలోకి రాజపక్స విధేయులు
              శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్న నిరసనకారులపై..ప్రభుత్వ మద్దతుదారులు దాడులకు దిగడంతో సోమవారం స్థానికంగా పరిస్థితులు హింసాత్మకంగా మారాయి. దాంతో పోలీసులు దేశవ్యాప్తంగా నిరవధిక కర్ఫ్యూ విధించారు. మరోవైపు దేశ రాజధాని కొలంబోలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 78మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న దేశంలో..పరిష్కార చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటూ పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతోన్న విషయం తెలిసిందే. అధికార నేతల రాజీనామాకు డిమాండ్‌ పెరుగుతోంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అమెరికా ఆర్థిక వ్యవస్థ మందగింపు
పాక్‌లో భారీ పరిశ్రమలకు సూపర్‌ ట్యాక్స్‌
బంగ్లాదేశ్‌లోనే పొడవైన వంతెన ప్రారంభం
మృత్యుకంపం
బ్రిటన్‌లో రైల్వే సమ్మె
విజయవంతంగా చైనా యాంటీ బాలిస్టిక్‌ క్షిపణి పరీక్ష
కొలంబియా అధ్యక్షుడిగా వామపక్ష నేత పెట్రో చారిత్రక విజయం
యూనియన్‌లో చేరిన ఆపిల్‌ కార్మికులు
మహమ్మద్‌ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండిస్తున్నాం : అమెరికా
అమెరికాలో కీలక పదవికి భారత సంతతి మహిళ నామినేట్‌
ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి సహకరిస్తాం : జిన్‌పింగ్‌
అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు
శ్రీలంకలో మూడేళ్ల వరకూ కరెంటు కోతలు : ఇంజనీర్ల హెచ్చరిక
జీడీపీ అంచనాలకు ఫెడ్‌ కోత
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకునే చర్యలు చేపట్టాలి
కువైట్‌ చట్టాలను ప్రవాసులు గౌరవించాల్సిందే !
మత్స్య కార్మికుల సబ్సిడీకి ఎగనామం
మహమ్మద్‌ ప్రవక్త గౌరవం విషయంలో రాజీపడం
పశ్చిమ దేశాల ఆయుధాల డిపోను ధ్వంసం చేశాం : రష్యా
ముందే హెచ్చరించాం... జెలెన్‌స్కీ వినలేదు
ఏజియన్‌ దీవుల సైనికీకరణ ఆపండి
పసిఫిక్‌ ద్వీప దేశాలతో సహకారానికి సిద్ధంగా వున్నాం : చైనా వెల్లడి
చాద్‌లో ఆహార అత్యవసర పరిస్థితి !
నైజీరియాలో నరమేధం
బంగ్లాదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం
మీరు తప్పులు చేసి మమ్మల్ని నిందిస్తారా?
అధిక ధరల నుంచి ఊరట కోసం కనీస వేతనాల పెంపు!
భారత్‌లో మత స్వేచ్ఛకు ముప్పు
కతార్‌ మాజీ యువరాణి అనుమానాస్పద మృతి
బహ్రెయిన్‌లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.