Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్టాకహేోం : ప్రఖ్యాత అర్థశాస్త్ర నిపుణులు ఆంగస్ డేటన్కు విశిష్టాత్మకమైన నోబెల్ పురస్కారం వరించింది. స్కాట్లాండ్కు చెందిన డేటన్ సూక్ష్మ అర్థశాస్త్రంలోని వినియోగం, పేదరికం, సంక్షేమాలపై చేసిన విశేష కృషికి గాను ఆయనకు ఈ గౌరవం దక్కిందని నోబెల్ బహుమతులను ప్రదానం చేసే రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలియజేసింది. డేటన్ 1945లో ఎడిన్బర్గ్లో జన్మించారు. 1974లో ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి పూర్తి చేశారు. 1983 నుంచి అమెరికాలోని ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్రం, అంతర్జాతీయ వ్యవహారాను బోధించే ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. డేటన్ అర్థశాస్త్రంలో 2013లో 'ద గ్రేట్ ఎస్కేప్' , 1980లో 'ఎకనామిక్స్ అండ్ కన్జూమర్ బిహేవియర్' పుస్తకాలను రచించారు. కాగా ప్రఖ్యాత స్వీడిష్ పారిశామ్రికవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం 1895 నుంచి రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైనెన్స్ నోబెల్ అవార్డుల ప్రదానం చేస్తోంది. అర్థశాస్త్రంలో విశేష కృషి చేసిన వారికి కూడా నోబెల్ పురస్కారం అందజేయాలని 1968లో స్వీడన్ కేంద్ర బ్యాంక్ ప్రతిపాదించింది. దీంతో అప్పటి నుంచి అర్థశాస్త్రంలో విశేష కృషి చేసిన వారికి నోబెల్ బహుమతులు ప్రదానం చేస్తున్నారు. డేటన్కు నోబెల్ జ్ఞాపికతో సహా 8 మిలియన్ల స్వీడిష్ క్రోనా ( రూ.6కోట్ల 33లక్షలు ) నగదు పురస్కారం లభించనుంది. ఈ పురస్కారాన్ని నోబెల్ వర్ధంతి రోజున ( డిసెంబర్ 10న ) అందజేస్తామని స్వీడిష్ అకాడమీ తెలిపింది.