Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతుల్లో కొంతమందికి ఇస్తాంబుల్లో అంత్యక్రియలు
ఇస్తాంబుల్: టర్కీ పేలుడు ఘటనలకు అధ్యక్షుడు ఎర్డోగన్ కారణ మంటూ ఆ దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేలుడులో మృతిచెందిన కొంతమందికి సోమవారం ఇస్తాంబుల్లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్తాంబుల్లో జరిగిన నిరసన ర్యాలీలో ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ర్యాలీకి హాజరైన వారు మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. ఇస్తాంబుల్లోని ప్రముఖ ప్రార్థనా స్థలానికి సమీపంలో ఈ అంత్యక్రియలు జరిపారు. అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. రాజధాని అంకారాలో శాంతిర్యాలీపై జరిగిన రెండు ఆత్మాహుతి బాంబుదాడుల్లో మొత్తం 97 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. శాంతిర్యాలీపై ఈవిధంగా ఆత్మాహుతి బాంబుదాడులకు తెగబడటాన్ని టర్కీ ప్రజలు ఎంతమాత్రమూ జీర్ణించు కోలేకపోతున్నారు. దీనిపై దేశ అధ్యక్షుడు ఎర్డోగన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇస్తాంబుల్లో సోమవారం నాటి అంత్యక్రియల కార్యక్రమానికి ప్రజలు భారీ సంఖ్యలో తరలిరావటం, ఖనన ప్రదేశం వరకూ నిర్వహించిన ర్యాలీలో ప్రజలు 'ఘటనకు బాధ్యుడు ఎర్డోగన్', 'అతడు దొంగ, హంతకుడు' అంటూ ఆగ్రహంతో నినాదాలు చేశారు.