Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిఎన్ఎ పరీక్షలకు ఐరాస సిఫార్సు
న్యూయార్క్ : ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులు ప్రపంచవ్యాప్తంగా సాగిస్తున్నట్లుగా చెబుతున్న లైంగిక దుష్ప్రవర్తన కారణంగా రాన్రాను ఐరాస బేబీలు ఎక్కువైపోతున్నారు. ఈ పిల్లల పితృత్వ సమస్యను పరిష్కరించేందుకు గానూ డిఎన్ఎ పరీక్షలను నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా 16 ప్రాంతాల్లో 125000మంది శాంతి పరిరక్షక సైనిక బలగాలు వున్నాయి. వీరు సాధారణంగా స్థానిక మహిళతో లైంగిక సంబంధాలు పెట్టుకుంటారు. లేదా అక్కడివారిపై లైంగిక నేరాలకు పాల్పడుతూ వుంటారు. ఇటువంటి సందర్భాల్లో డిఎన్ఎ పరీక్షలు చేయిస్తే పుట్టిన పిల్లల తండ్రి ఎవరనేది తేలుతుంది. గత ఏడాది ఇటువంటి కేసులు డజను వరకు వచ్చాయి. అందులో నాలుగు కేసులు మైనర్పై జరిగిన లైంగిక దాడికి సంబంధించినవే. ఇటువంటి కేసులు, ఆరోపణలు ఎక్కువై పోతున్న నేపథ్యంలో ఐరాస మానవహక్కుల సంస్థ డిఎన్ఎ పరీక్షలకు సిఫార్సు చేసింది. ఇప్పటివరకు ఇది స్వచ్ఛంద చర్యగానే వున్నప్పటికీ భవిష్యత్తులో దీనిపై ఎలాంటి ఆరోపణలు తలెత్తకుండా వుండాలంటే డిఎన్ఎ డేటా బ్యాంక్ను ఏర్పాటు చేయాలని ఐరాస ఒక నివేదికలో సూచించింది. శాంతి పరిరక్షక బలగాలు ఏ దేశంలో అయితే వుంటాయో ఆ దేశమే డిఎన్ఎ పరీక్షలను నిర్వహిస్తుందా లేదా అని ఐరాస ప్రశ్నిస్తుంది. ఒకవేళ సదరు దేశం చేయకపోతే తామే చేయడానికి ముందుకు వస్తుంది. అయితేఐరాసకు నేరపూరితమైన దర్యాప్తులను నిర్వహించే అధికారం లేకపోవడం వల్ల ఏ దేశాన్ని కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా బలవంతం చేయడానికి వీల్లేదు. కాబట్టి తానే చేయడానికి ముందుకువస్తుంది.