Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాంగాన్ : రోహింగ్యా ముస్లింలను ఊచకోత కోస్తున్న మయన్మార్ ఏఆర్ఎస్ ( అరాకన్ రోహింగ్యా సాల్వేషన్ ) ఆర్మీపై ప్రతీకారం తీర్చుకుంటామని ఐఎస్ అనుబంధ సంస్థ అల్ఖైదా హెచ్చరించింది. రోహింగ్యా ముస్లింకు బాసటగా నిలుస్తామని బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. వారిపై దాడులు పునరావృతమైనట్టయితే మయన్మార్ను భూస్థాపితం చేస్తామని హెచ్చరించింది. 2001, సెప్టెంబర్11న అమెరికాలో దాడులు జరిపిన అల్ఖైదా ఉగ్రసంస్థ తాజాగా ఈ ప్రకటన చేసింది. అంతేగాకుండా, మయన్మార్లోని రోహింగ్యా ముస్లింలకు సహకారం అందించాలని ఇస్లామిక్ దేశాలకు పిలుపునిచ్చింది. రోహింగ్యా ముస్లింలను అతిదారుణంగా హత్య చేసిన మయన్మార్ ఏఆర్ఎస్ బలగాలకు రక్తం రుచి చూపిస్తామని లేఖలో హెచ్చరించింది. కాగా, బౌద్ధ మతస్థుల జనాభా అధికంగా ఉన్న మయన్మార్లో రోహింగ్యా ముస్లింలకు నిలువనీడ లభించడం లేదు. వారిని తరిమివేయాలనే దురుద్దేశంతో అక్కడి మితవాద బలగాలు నరమేధం సృష్టిస్తున్నాయి. రోహింగ్యాల ఇండ్లలోకి చొరబడి కాల్చి చంపుతున్నాయి.మహిళలపై అఘాయి త్యాలకు పాల్పడుతున్నాయి. పసిపిల్లల ను సైతం నిర్ధాక్షణ్యంగా చంపేస్తు న్నాయి. ప్రాణభయంతో దాదాపు 4లక్షల మంది రోహింగ్యా శరణార్థులు మయన్మార్ నుంచి బంగ్లాదేశ్కు తరలివెళ్లారు.
ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశం : మయన్మార్లోని రోహింగ్యా ముస్లింలపై జరుగుతున్న అమానవీయ దాడులను ఐరాస ఖండించింది. మయన్మార్లోని ఏఆర్ఎస్ ఆర్మీ అంతర్జాతీయ చట్టాలను తుంగలో తొక్కి నరమేధం సృష్టిస్తోందని మానవ హక్కుల హై కమిషనర్ జీద్ రాద్ అల్హుస్సేన్ విమర్శించారు. బంగ్లాదేశ్లో ఆశ్రయం కోసం మయన్మార్లో రఖైన్ రాష్ట్రం నుంచి బయలుదేరిన రోహిం గ్యా ముస్లింలను వెంటాడి కాల్చి చంపాయని అన్నారు. మృతుల్లో అభం శుభం తెలియని చిన్నారులు, వృద్ధులు, మహిళలు అధికంగా ఉన్నారన్నారు. మయన్మార్ అరాచకాలపై బ్రిటన్, స్వీడన్ దేశాలు గళమెత్తాయి. అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని ఐరాస భద్రతా మండలిపై ఒత్తిడి తెచ్చాయి.
ఈనేపథ్యంలో ఐరాస భద్రతా మండలి బుధవారం సమావేశమైంది. రోహింగ్యా ముస్లింలను మయన్మార్ ఏఆర్ఎస్ బలగాలు ఊచకోత కోయడం పట్ల పలు దేశాలు మండిపడ్డాయి. అంతేగాకుండా, ఆశ్రయం కోసం ఇక్కట్లు పడుతున్న రోహింగ్యా ముస్లింలను ఆదుకునేందుకు పలు దేశాలు ముందుకొచ్చాయి. లక్ష మంది రోహింగ్యా ముస్లింలకు ఆశ్రయం కల్పించినట్టు మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ తెలిపారు.