Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సియోల్: కొరియా ద్వీపకల్పంలో అమెరికా యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నది. తాజాగా మళ్లీ ద.కొరియాతో కలిసి సంయుక్త సైనిక విన్యాసాల్ని ప్రారంభించింది. దక్షిణకొరియా తూర్పు తీరంలో నావికాదళ విన్యాసాలు చేపట్టింది. యూఎస్ఎస్ రొనాల్డ్ రేగాన్, దియోడోర్ రూస్వెల్ట్, నిమిజ్ బ్యాటిల్ గ్రూప్లు సముద్ర జలాల్లోకి వెళ్లినట్టు దక్షిణ కొరియా మిలిటరీ తెలిపింది. శనివారం నుంచి నాలుగు రోజులపాటు ఈ సైనిక డ్రిల్ జరుగుతుందని పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసియాలో పర్యటిస్తున్న సమయంలో ఈ డ్రిల్ చేపట్టడం గమనార్హం.