Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బోన్ : 2020 ముందస్తు పర్యావరణ చర్యలపై భారత్కు, ఇతర వర్ధమాన దేశాలకు కాస్త ఊరట లభించింది. వచ్చే రెండు పర్యావరణ సదస్సుల్లో ఈ అంశంపై చర్చలు జరుపుతామని సంపన్న దేశాలు అంగీకరించాయి. ఫిజి అధ్యక్షతన జర్మనీలోని బాన్లో కాప్-23 పేరిట జరుగుతున్న ఐక్యరాజ్యసమితి పర్యావరణ మార్పుల సదస్సులో ఈ మేరకు ఒక ఒప్పందం కుదిరింది. క్యోటో ప్రోటోకాల్ - 1997కు కొనసాగింపుగా దోహా సదస్సులో చేసిన సవరణల ఒప్పందంపై సంతకాలు చేయని దేశాలన్నిటికీ వీలైనంత త్వరగా సంతకాలు చేయాలని కోరుతూ సంపన్న దేశాలు లేఖలు పంపాయి. ఉద్గారాల తగ్గింపు, సాంకేతికత, ఆర్థిక సహకారం సహా క్యోటో ప్రోటోకాల్ ప్రకారం కట్టుబడిన లక్ష్యాల పురోగతిపై వచ్చే ఏడాది మే 1 లోగా సమాచారాన్ని పంపాలని కూడా కోరాయి. 2020 ముందస్తు పర్యావరణ చర్యల అంశాన్ని చర్చల్లో ప్రధాన అంజెండాగా చేర్చాలని ఈ నెల 6న పర్యావరణ సదస్సు ప్రారంభమైనప్పటి నుంచి భారత్, ఇతర వర్ధమాన దేశాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. అయితే సంపన్న దేశాలు ఇప్పటి వరకు దానికి నిరాకరిస్తూవచ్చాయి. 2015లో పారిస్ ఒప్పందంలో భాగంగా 2020 తర్వాత చేపట్టాల్సిన పర్యావరణ కార్యచరణకు 2020లోగా తీసుకుంటామని కట్టుబడిన చర్యలను వదిలేస్తామని కాదని భారత పర్యావరణ కార్యదర్శి సికె మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు.