Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోహింగ్యాలపై సూకీ ఆశాభావం
నెపిటా : రోహింగ్యాల విషయమై బంగ్లాదేశ్తో ఒప్పందం కుదరగలదని ఆశిస్తున్నట్లు మయన్మార్ నేత ఆంగ్సాన్ సూకీ చెప్పారు. ఈ వారంలో బంగ్లాదేశ్ ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతామని, గత మూడు మాసాలుగా బంగ్లాదేశ్కు పారిపోయిన రోహింగ్యాలు సురక్షితంగా తిరిగి స్వదేశానికి రావడంపై అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంటామని ఆశిస్తున్నట్లు చెప్పారు. మయన్మార్లోని రాఖినె రాష్ట్రంలో సైన్యం చేపట్టిన చర్యలతో ఆరు లక్షల మందికి పైగా రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్ పారిపోయారు. ఈ ప్రక్షాళన చర్యల సందర్భంగా సైన్యం రోహింగ్యాలపై అత్యాచారాలకు పాల్పడిందని మానవ హక్కుల గ్రూపులు ఆరోపించాయి.
అసెమ్ సమావేశం(ఆసియా-యూరప్ మీటింగ్)లో సీనియర్ అధికారులతో చర్చలు అనంతరం మానవహక్కుల ఉల్లంఘనలకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు సూకీ సమాధానమిస్తూ, 'అవి జరిగాయో లేదో చెప్పలేం. కానీ ప్రభుత్వానికి గల బాధ్యతగా మరోసారి మానవ హక్కులు ఉల్లంఘనలు వంటివి చోటు చేసుకోకుండా చూడగలం' అని స్పష్టం చేశారు. రోహింగ్యాలను వెనక్కి రప్పించడంపై బుధ, గురువారాల్లో బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిలో చర్చలు జరిపామని తెలిపారు. మయన్మార్కు తిరిగి రావాలనుకుంటున్న రోహింగ్యాల దరఖాస్తులను ఎలా పరిష్కరించాలనే అంశంపై ఇరు దేశాలకు చెందిన అధికారులు చర్చలు జరిపినట్లు తెలిపారు.