Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 50 మంది మృతి
అబుజా : నైజీరియాలో మంగళవారం ఉగ్రవాదులు మారణోమం సృష్టించారు. ముబిలోని ఓ మసీదు వద్ద ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ప్రమాదంలో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని అక్కడి పోలీస్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. 'ముబిలోని మసీదు వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు' అని పోలీస్ ప్రతినిధి అబు బకర్ వెల్లడించారు. బోకోహారమ్ జిహాదీలు ఈ మారణహోమానికి పాల్పడి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. పేలుడు కారణంగా మృతదేహాలు చెల్లాచెదురుగాపడి.. రక్తమోడిన మసీదు పరిసర ప్రాంతాలు భీతావాహంగా మారాయి. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.