Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్ : బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా (బ్రిక్స్) దేశాలకు చెందిన అత్యుత్తమ విద్యాసంస్థల్లో భారత విద్యాలయాలు గతంలో కన్నా తమ స్థానాన్ని గణనీయంగా మెరుగు పరచుకున్నాయి. తొలి 20 స్థానాల్లో నాలుగింటిని కైవసం చేసుకున్నాయి. వీటిలో మూడు ఐఐటీలు కాగా మరొకటి బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ). బ్రిక్స్ దేశాల్లోని 300 విశ్వవిద్యాలయాలను పరిశీలించిన క్వాకరెల్లి సైమండ్స్(క్యూఎస్) 2017కు గానూ ఈ ర్యాంకులను ప్రకటిం చింది. ఐఐటీ (ముంబయి) 9వ స్థానంలో, ఐఐఎస్సీ(బెంగళూరు) 10, ఐఐటీ (దిల్లీ)15, ఐఐటీ (మద్రాస్) 18వ స్థానంలో నిలిచాయి. తొలి 10 స్థానాల్లో 8 చైనా విశ్వవిద్యాలయాలకే దక్కాయి. చైనా తర్వాత అత్యధిక ర్యాంకులు భారత్కే లభించాయని భారత యూజీసీ చైర్మెన్ వీఎస్ చౌహాన్ తెలిపారు.