Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయీద్ అక్బరుద్దీన్ ట్విట్టర్ ఖాతా ఆదివారం ఉదయం హ్యాకింగ్కు గురైంది. ఆయన ట్విట్టర్ ఖాతాలో పాకిస్థాన్ జెండాను, ఆ దేశ అధ్యక్షుడు మమ్మూన్ హుస్సేన్ ఫొటోను పోస్టు చేశారు. దీంతోపాటు అక్బరుద్దీన్ ట్విట్టర్ ఖాతాకు ఉండే వెరిఫైడ్బ్లూ కలర్ టిక్మార్క్ కూడా హ్యాకింగ్ సమయంలో అదృశ్య మైంది. ఆయన చేసిన పలు ట్వీట్లను కూడా హ్యాకర్లు తొలగించారు. ఆయన ట్విట్టర్ ఖాతా హ్యాకింగ్ గురైన విషయాన్ని పలువురు నెటిజన్లు ట్వీట్లు చేయడంతో విషయం బయటకు వచ్చింది. దీనిపై స్పందించిన ట్విట్టర్ ఇండియా వెంటనే ఆయన ఖాతాను పునరుద్ధరించింది. ఈ విషయాన్ని అక్బరుద్దీన్ ధ్రువీక రించారు. మళ్లీ తన ఖాతా తిరిగి వచ్చిం దని ఆయన ట్వీట్ చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదులు ఇటీవ ల కాలంలో భారత ప్రభుత్వ అధికారుల ను లక్ష్యంగా చేసు కొని సైబర్ అటాక్కు పాల్పడు తున్నారు.