Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిల్లలను చిత్రహింసలు పెట్టిన దంపతుల అరెస్ట్
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో అమానవీయ ఘటన చోటుచేసుకున్నది. 13 మంది పిల్లలను గృహనిర్బంధం చేసి చిత్రహింసలకు గురిచేసిన దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. కాలిఫోర్నియా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం...డేవిడ్ ఆలెన్ టర్పిన్(57, లూయిస్ అన్నా టర్పిన్(49) దంపతులకు 13 మంది సంతానం. వారి సంతానంలో ఏడుగురు మేజర్లు. లాస్ ఏంజిల్స్ నుంచి 95కిలోమీటర్ల దూరంలో ఉన్న పెర్రిస్ నగరంలో వారంతా నివాసముంటున్నారు. దంపతులిద్దరూ తమ 13 మంది పిల్లల చేతులను తాళ్లతో కట్టివేసి, వాళ్లను మంచాలకు కట్టేశారు. తల్లిదండ్రుల చిత్రహింసలను భరించలేకపోయిన ఓ అమ్మాయి ఇంటి నుంచి పారిపోయి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన బయటపడింది. కొందరు పిల్లల్ని చీకటి గదిలో మంచాలకు గొలుసులతో కట్టేసి ఉంచారు. వారి చుట్టూ బాగా మురికి, చెడు వాసన వస్తున్నదని పోలీసులు వెల్లడించారు. అయితే పిల్లల్ని ఎందుకు అలా కట్టేశారన్న దానిపై తల్లిదండ్రలు వివరణ ఇవ్వలేకపోయారు. బాధితులంతా తిండిలేక బలహీనంగా ఉన్నారని, అందరినీ స్థానిక ఆస్పత్రిలో చేర్పించినట్టు పోలీసులు తెలిపారు. అసలు పిల్లల్ని వారు ఎందుకు అలా హింసించారనే విషయమై అర్ధం కాలేదని పోలీసులు చెప్పారు. ఈ విషయమై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.