Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగ్గురు మృతి
బెర్లిన్ : జర్మనీలో తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. తుఫాను తాకిడితో గురువారం ముగ్గురు మృతి చెందారు. గంటకు 140కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. తుఫాను ప్రభావంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్టు ఆమ్స్టర్డ్యామ్ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.