Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ పార్టీనుంచి ఆరేండ్లు బహిష్కరణ
బెంగుళూరు: కర్నాటకలోని బెంగుళూరులో ఓ రెస్టారెంట్లో డాలర్ కాలనీకి చెందిన వ్యక్తి పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు శనివారం రాత్రి దాడి చేశారు. బెంగుళూరు జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నిందితుడు మహమ్మద్ హరిస్ నలపాడును పార్టీ నుంచి ఆరేండ్లు బహిష్కరించారు. 10మంది స్నేహితులతో కలిసి యూబీసిటీలోని రెస్టారెంట్కు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎ హరిస్ తనయుడు నలపాడు..రెస్టారెంట్లో కాలుకు ప్లాస్టర్తో ఉన్న బాధితుడు విద్వత్ను సరిగా కూర్చోవాలని ఆదేశించాడు. తర్వాత ఇరువర్గాల మధ్య వాదనలు ముదిరి గొడవకు దారితీశాయి. నలపాడు బృందం విద్వత్ను తీవ్రంగా కొట్టారు. స్థానికులు బాధితుడిని దగ్గరలోని మాల్యా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి దాకా వెంబడించి అక్కడ కూడా బాధితుడిపై దాడి చేశారు. ఈ ఘటనలో నలపాడు సహా అతని మిత్రులు 10మందిపై కేసు నమోదు చేసినట్టు సిటీ పోలీసులు తెలిపారు. నిందితులు పరారీలో ఉన్నారు. కమారుడు ఎక్కడ ఉన్నాడో తనకు తెలియదని ఎమ్మెల్యే ఎన్ఎ హరిస్ అన్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తున్నదని తెలుపుతూ..చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు. నిందితులు ఎంతవారైనా సరే శిక్షను అనుభవించాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. త్వరలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో కాంగ్రెస్ ఇరుకునపడింది.