Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రమీ హమ్దాల్లా సురక్షితం, ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలు
గాజా : పాలస్తీనా ప్రధాని రమీ హమ్దాల్లా కాన్వారుపై గాజాలో ఉగ్రదాడి జరిగింది. హమ్దాల్లా లక్ష్యంగా ఉగ్ర వాదులు ఈ పేలుడుకు పాల్ప డినట్టు పోలీసులు అనుమా నిస్తున్నారు. అయితే, ప్రధాని వాహనం సెక్యూరిటీ చెక్పా యింట్ దాటి ముందుకు వెళ్లిన వెంటనే కాన్వారుపై బాంబు పేలింది. ఈ ఘటనలో ఐదుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రధాని సురక్షితంతా ఉన్నట్టు పీఎం కార్యాలయం వెల్లడించింది. పాలస్తీనా ప్రధాని కార్యాలయం ప్రతినిధి తెలిపిన వివ రాల ప్రకారం...గాజాలోని బీట్ హనౌన్ చెక్పాయింట్ వద్ద రమీ హమ్దాల్లా కాన్వారుపై దాడి జరిగింది. ఈ దాడిలో పాలస్తీనా ప్రధాని తృటిలో తప్పించుకున్నారు. ఈదాడికి బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్ర సంస్థ కూడా ప్రకటించుకోలేదు. ప్రధాని కాన్వారుపై దాడి ఘటనను పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ ఖండించారు. ఇది కచ్చితంగా ఉగ్రవాద చర్య అని అనుమానిస్తున్నామని అన్నారు. ఈ దాడి వెనుక గాజా అధికార పార్టీ నేతలకు సంబంధాలున్నాయని ఆరోపిం చారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.