Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెల్లింగ్టన్ : న్యూజిలాండ్లో పైలట్ రహిత ఎగిరే టాక్సీలను పరీక్షిస్తున్నారు. గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్ ఈ ప్రాజెక్టుకు మద్దతిస్తున్నారు. ఈ ట్యాక్సీలతో ప్రజా రవాణా రంగంలో విప్లవం వస్తుందని మద్దతుదారులు పేర్కొంటున్నారు. పేజ్ కంపెనీ కిట్లీ హాక్ అనుబంధ సంస్థ అయిన జిఫిర్ ఎయిర్వర్క్స్ ఎయిర్ ట్యాక్సీలను అభివృద్ధిపరిచి, పరీక్షించే ప్రణాళికకు న్యూజిలాండ్ అధికారులు ఆమోద ముద్ర వేశారు. కోరాగా పిలిచే ఈ ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్కు రెక్కలపై చిన్న లిఫ్ట్ రూటర్లు వుంటాయి. దీంతో, ఈ ఎయిర్క్రాఫ్ట్ నిట్ట నిలువుగా టేకాఫ్ తీసుకోగలుగుతుంది. హెలికాప్టర్ మాదిరిగా ల్యాండ్ అవుతుంది. పట్టణప్రాంతాల్లో ఇండ్ల పైకప్పులను, కార్ పార్కింగ్ ప్రాంతాలను ల్యాండింగ్ పాడ్లుగా ఉపయోగించుకుంటూ అక్కడ మాత్రమే ప్రయాణికులను రవాణా చేయగలుగుతుందని డెవలపర్లు చెబుతున్నారు. ఈ టాక్సీల నుండి ఎలాంటి కాలుష్యం వెలువడదని, రవాణా రంగంలో ఇదొక అద్భుతమైన దశ అని జిఫిర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రెడ్ రెయిడ్ చెప్పారు. కోరా నమూనాను న్యూజీలాండ్లోని దక్షిణ దీవిలో పరీక్షిస్తున్నారు.
ఈ వాహనంలో మూడు కంప్యూటర్లు వుండి ప్రయాణ మార్గాన్ని నిర్దేశిస్తాయి. ఎగిరే టాక్సీల్లో ఇద్దరు ప్రయాణికులు ప్రయాణించవచ్చు.