Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టర్కీ దాడుల్లో 18 మంది మృతి
డమాస్కస్ : సిరియాలో నరమేధం కొనసాగుతోంది. బాంబు పేలుళ్లు, ఫిరంగుల చప్పుళ్లతో ఈ ప్రాంతమంతా భీతావహంగా మారింది. తాజాగా ఆఫ్రిన్ నగరంలో టర్కీ సైన్యం జరిపిన దాడిలో 18 మంది మృతి చెందారు. ఉత్తర సిరియాలో కుర్దు వర్గానికి చెందిన ప్రజలు అధికంగా నివసించే ఆఫ్రిన్ నగరాన్ని లక్ష్యంగా చేసుకొని టర్కీ దాడులకు పాల్పడటంతో వీరంతా మరణించినట్టు సిరియాలోని హక్కుల పర్యవేక్షణ సంస్థ తెలిపింది. మృతుల్లో ఐదుగురు చిన్నారులున్నారని పేర్కొంది. ఈ ఏడాది జనవరి 20న టర్కీ, సిరియాకు చెందిన తిరుగబాటు ప్రతినిధులు ఆఫ్రిన్ ప్రాంతంలో ప్రమాదకరమైన ఫిరంగులను ఏర్పాటు చేశారు. వీటి మూలంగానే ఆఫ్రిన్ ప్రాంతంలో అలజడులు చెలరేగుతున్నాయి. యూఎస్ మద్దతు గల వైపీజీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పటికే టర్కీకి చెందిన బలగాల చేతిలో చిక్కుకోవడంతో రోజుకో ఘటన జరుగుతోంది. నగర ప్రజలు పారిపోయేందుకు వీలుగా ఒకే ఒక రోడ్డు మార్గం మాత్రమే ఉండటంతో వారంతా బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. శుక్రవారం నాటికి 30 వేల మంది ఆఫ్రిన్ ప్రజలు మరణించినట్టు ఒక నిఘా సంస్థ తెలిపింది. సిరియాలో 2011లో అంతర్యుద్ధం చెలరేగింది. ప్రాభభయంతో కోటి 20లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలసవెళ్లారు. దాదాపు 4లక్షల మంది ఆచూకీ నేటికీ లభ్యం కాలేదు.