Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరుగురు మృతి , 9 మందికి గాయాలు
వాషింగ్టన్ : అమెరికాలోని మియామి నగరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఫ్లోరిడా యూనివర్సిటీకి సమీపంలో నూతనంగా నిర్మించిన ఫుట్ఓవర్ బ్రిడ్డి ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...మియామి నగరంలోని బ్రిడ్జి కూలిపోవడంతో ఆరుగురు మృతి చెందారు. అనేక వాహనాలు బ్రిడ్జి కిందే ఉండిపోయాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, సిటీ ఆఫ్ స్వీట్వాటర్ను అనుసంధానించి విద్యార్థులు దాటేందుకు ఈ బ్రిడ్జిని నిర్మించగా..తాజాగా దీనిని ప్రారంభించారు. 14.2 మిలియన్ డాలర్లతో ఈ బ్రిడ్డిని నిర్మించారు. సెల్ఫ్ ప్రొపెల్డ్ మాడ్యూలర్ ట్రాన్స్ పోర్టేషన్ విధానంలో అమెరికాలో నిర్మించిన తొలి బ్రిడ్జి ఇదే కావటం గమనార్హం. ఫ్లోరిడా గవర్నర్ రిక్ స్కాట్, సెనెటర్ మాక్రో రూబియో ఘటనాస్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల కుటుంబాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.