Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జుబూ : ప్రపంచంలో చిట్టచివరగా మిగిలిన మగ తెల్ల ఖడ్గ మృగం 'సూడాన్' కన్నుమూసింది. 45 ఏండ్ల వయసున్న ఈ అరుదైన జీవి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. మంగళవారం ఉదయం సూడాన్ మృతి చెందినట్టు ఓఎల్ పెజెటా పార్క్ నిర్వాహకులు ప్రకటించారు.
వేటగాళ్ల బారి నుంచి కంటికి రెప్పలా కాపాడుకోవడానికి మూడేండ్ల నుంచి సూడాన్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది. దీని పరిరక్షణ కోసం కెన్యా ప్రభుత్వం ఇప్పటిదాకా కోట్లలో ఖర్చు చేసి మరీ భద్రతను ఏర్పాటు చేయించింది. వీవీఐపీ వైట్రైనోగా ఇది బాగా పాపులర్ అయ్యింది.ప్రపంచంలో అంతరించి పోతున్న జంతువులలో తెల్ల ఖడ్గ మృగాలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటిదాకా మిగిలినవి మూడు మాత్రమే. అందులో సూడాన్ ఒకటి కాగా.. మిగిలిన రెండూ ఆడవి.