Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 మంది మృతి, 10 మందికి గాయాలు
మొగధీషు : సోమా లియా రాజధాని మొగధీషు లో కారు బాంబు పేలింది. ఈ ఘటనలో 14 మంది మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. క్షతగా త్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...మొగధీషు నగరంలోని మాక అల్-ముకర్రమా రోడ్డులోని తవెహేలియో హోటల్ సమీపంలోకారు బాంబు పేలింది. ఈ ఘటనలో 14 మంది చనిపోయారు. 10 మంది క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు ధాటికి హోటల్కు సమీపంలో ఉన్న భవనాలు ధ్వంసమయ్యాయి. పేలుడు శబ్ధంతో భయాందోళనకు గురైన స్థానిక ప్రజలు ప్రాణభయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు అల్-షాబాబ్ ఉగ్రసంస్థ ప్రకటిం చుకుంది.