Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ 2016 ఎన్నికల ప్రచారంలో అనుచిత ప్రయోజనాల కోసం ఎఫ్బీఐ ఏజెంట్లు గూఢచర్యం చేశారా? అన్న అంశంపై అమెరికా న్యాయ శాఖ దర్యాప్తు చేపట్టనుందని డిప్యూ టీ అటార్నీ జనరల్ రాడ్ రోసెన్స్టీన్ తెలిపారు. రాజకీయ కారణాలతో తన ఎన్నికల ప్రచారంపై ఎవరైనా నిఘా పెట్టారా అనేది తెలుసుకోవడానికి ఈ విచారణ జరుగుతుందని, ఎఫ్బీఐ గూఢచర్యం వెనుక గత పాలకుల ఆదేశాలేమైనా ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నట్టు అమెరికా అధ్యక్షు డు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్లో పేర్కొన్నారు. ఎఫ్బీఐకి చెందిన ఒక ఇన్ఫార్మర్ ట్రంప్ ప్రచార సహాయ కులను కలిసినట్టు అమెరికా మీడియా నివేదికలు సూచించాయి. ఈ ప్రచారానికి సంబంధించి ఇప్పటికే అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఆదివారం కూడా ట్రంప్ వరుస ట్వీట్స్ చేశారు. తనను అనవసరంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటివరకూ రష్యాతో ఎలాంటి రహస్య ఒప్పందం చేసుకోలేదన్నారు.