Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్ : కిమ్తో వచ్చే నెలలో జరగాల్సిన చరిత్రాత్మక శిఖరాగ్ర సమావేశం ఆలస్యం కావొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. వైట్హౌస్లో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే-ఇన్కు స్వాగతం పలికిన తర్వాత ఆయన ఈ విషయం వెల్లడించారు. వారిద్దరూ ఈ శిఖరాగ్ర సమావేశం గురించి చర్చించారు. 'కిమ్ నుంచి ఏం ఆశించవచ్చు, ఏం ఆశించగూడదు' అనే విషయాల్ని మూన్ ఈ భేటీలో ట్రంప్కు వివరించినట్టు దక్షిణకొరియా స్టేట్ మీడియా తెలిపింది. ఉత్తర కొరియా ఏకపక్షంగా అణ్వాయుధాల్ని త్యజించాలని అమెరికా పట్టుబడితే తాము ట్రంప్తో శిఖరాగ్ర సమావేశాన్ని రద్దు చేసుకుంటామని ఉత్తర కొరియా గత వారం ప్రకటించిన సంగతి తెలిసిందే.