Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇద్దరు మృతి, 23 మందికి గాయాలు
రోమ్ : ఇటలీ రాజధాని రోమ్ నగరంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను రైల్వే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... పిడ్మాంట్ రీజియన్లోని తూరిన్, ఐవీరియా నగరాల మధ్య ఈ ప్రమాదం జరిగింది. లెవల్ క్రాసింగ్ వద్ద రైలు పట్టాలు దాటుతున్న లారీని ఫెర్రోవీ డెల్లో స్టాటో రైలు బలంగా ఢకొీంది. దీంతో, రైలు, లారీ డ్రైవర్లు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. 23మంది గాయపడ్డారు. ఈ ఘటనలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. రైలు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. 2016లో పుగిలా ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 23 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే.