Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనగువా : శాంతిని నెలకొల్పాలని, హింసకు పాల్పడవద్దని నికరాగ్వా ప్రజలకు అధ్యక్షుడు ఒర్టెగా పిలుపిచ్చారు. ఏప్రిల్ నుండి నికారాగ్వాలో హింస చెలరేగుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించింది. ఓర్టెగా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు విదేశీ శక్తుల ప్రోద్బలంతో అల్లర్లు, ఘర్షణలు, రహదారుల దిగ్బంధనాలు, హత్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం వేలాదిమంది ప్రజలను ఉద్దేశించి అధ్యక్షుడు ప్రసంగించారు. దేశవ్యాప్తంగా శాంతి నెలకొల్పేందుకు సహకరించాల్సిందిగా ఆయన కోరారు. 1979లో ఆనాటి నియంత అనాస్టాసియో సొమోజాకు వ్యతిరేకంగా వ్యూహాత్మక ఎత్తుగడతో సాగిన తిరోగమనం 39వ వార్షికోత్సవాన్ని ఈనాడు జరుపుకుంటున్నామని, ఈ సందర్భంగా శాంతి కోసం జరిపే పోరాటాన్ని అమరవీరులకు అంకితమివ్వాలని ఓర్టెగా పేర్కొన్నారు.