Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భద్రతా బలగాల చేతిలో 100మంది తాలిబాన్లు హతం
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లో భద్రతా దళాలు తాలిబన్లపై విరుచుకుపడ్డాయి. ఫక్తూన్ ప్రావిన్స్లో శుక్రవారం జరిగిన భీకర పోరాటంలో దాదాపు 100 మంది తాలిబన్లను మట్టుబెట్టాయి. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ మీడియా వెల్లడించింది. ఈ పోరాటంలో భారీ సంఖ్యలో తాలిబన్ స్థానిక కమాండర్లు చనిపోయారు. భద్రతా దళాలు ఈ ప్రాంతంలో భారీ సంఖ్యలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ధ్వంసం చేశాయి. ముఖ్యంగా ప్రభుత్వ దళాలు నిర్వహించిన వైమానిక దాడుల్లో ఎక్కువ మంది మృతి చెందినట్టు తెలిసింది.
మరోవైపు తాలిబన్ ప్రతినిధులు ఈ వార్తలను ఖండిస్తున్నారు. అక్కడ చనిపోయిన వారంతా అమాయక ప్రజలని వారు చెబుతున్నారు. కొన్నేండ్లుగా తాలిబన్లకు పట్టున్న ప్రాంతాల్లో ప్రభుత్వ దళాలు తరచూ పోరాటాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి సమాంతరంగా పలు ప్రాంతాల్లో కొన్ని ఉగ్రవాద ముఠాలు పాలన నిర్వహిస్తున్నాయి.