Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, కుమార్తె మరియం బెయిల్ కోసం సోమవారం ఇస్లామాబాద్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారని స్థానిక మీడియా వెల్లడించింది. లండన్లో నాలుగు విలాస వంతమైన ఫ్లాట్లను కలిగి ఉన్నారని ఆరోపిస్తూ జులై 6న కోర్టు వీరిని దోషులుగా తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. లండన్ వచ్చిన షరీఫ్, మరియంను లాహోర్లో పోలీసులు అరెస్టు చేశారు. ఈ తీర్పుపై లోపాలు, ఇస్లామాబాద్ అకౌంటబిలిటీ కోర్టు తీర్పును రద్దు చేయాలని అప్పీల్లో పేర్కొని ఉంది. అదేవిధంగా ఈ ముగ్గు రు నిందితులను బెయిల్పై విడుదల చేయాలని కోరినట్టు ఓ పత్రిక వెల్లడిం చింది. అడియాలా జైలు పరిధిలో ఉన్న రెండు అవినీతి కేసుల విచారణలకు వ్యతిరేకంగా కూడా అప్పీల్ దాఖలైందని పేర్కొంది.