Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8 మంది శరణార్థులు మృతి, 90 మంది పరిస్థితి విషమం
ట్రిపోలి: లిబియాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పేదరికమే శరణార్థుల పాలిట శాపంగా మారింది. ఓ ట్రక్కు డ్రైవర్ నిర్వాకం కారణంగా 8 మంది శరణార్థులు బలైపోయారు. మరో 90 మంది చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టు మిట్టాడుతున్నారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ డ్రైవర్ తన ట్రక్కు కంటెయినర్లో శరణార్థులను తరలించాడు. పరిమితికి మించి శరణార్థులను ట్రక్కులో తరలించాడు. అంతేగాకుండా, తనిఖీ అధికారులు ట్రక్కులో సోదాలు నిర్వహిస్తారనే భయంతో శరణార్థులందరినీ ట్రక్కు కంటెయినర్లో ఉంచి బయట నుంచి తాళం వేశాడు. డ్రైవర్ తమను అతి తక్కువ ధరలో ఇతర ప్రాంతానికి తరలిస్తున్నాడని భావించిన శరణార్థులు ట్రక్కు కంటెయినర్లోనే ఉండిపోయారు. మార్గం మధ్యలో ఊపిరి ఆడకపోవడంతో 8 మంది శరణార్థులు మృతి చెందారు. మిగతా 90 మంది శరణార్థులు శ్వాస అందకపోవడంతో ఇబ్బందిపడుతున్నారు. వీరిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. కేసు నమోదు చేసుకున్న అధికారులు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.