Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8మంది మృతి
కానో (నైజీరియా) : ఈశాన్య నైజీరియాలోని రెండు గ్రామాలపై బోకోహరాం తీవ్రవాదులు జరిపిన దాడుల్లో 8మంది పౌరులు మరణించారు. మొడు అజిరీ, బులామా కైయీరి అనే గ్రామాలపై దాడిచేసిన బోకోహరాం, అక్కడి పశువుల్ని, గొర్రెల్ని సైతం ఎత్తుకెళ్లారు. అడ్డువచ్చిన గ్రామస్తులపై కాల్పులు జరిపి చంపేశారు. 8మంది చనిపోగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్తలపైకి ఆయుధాలతో దాడి చేశారని సైన్యం అధికార ప్రతినిధి బును బుకార్ ముస్తఫా మీడియాకు తెలియజేశారు. సైనిక స్థావరాల్ని లక్ష్యంగా చేసుకొని బోకోహరాం దాడులు చేయటం సహజంగా జరిగేదని, అయితే ఇలా గ్రామాలపై దాడులు చేయటం ఇప్పుడిప్పుడే చూస్తున్నామని ఆ అధికారి అన్నారు. నైజీరియాలోని బోకోహరాం తీవ్రవాదుల తాకిడి కారణంగా పక్కనున్న చాద్, నైగర్, కామెరూన్ దేశాల్లో వేలాది మంది మృత్యువాత పడ్డారు. వేలాదిమంది శరణార్థులుగా మారాల్సివచ్చింది.