Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హాలిఫాక్స్ (కెనడా): వాతావరణ మార్పులు, సముద్ర జలాల వినియోగం, క్లీన్ ఎనర్జీ వంటి అంశాలపై చర్చించేందుకు జి7గ్రూప్ దేశాలకు చెందిన పర్యావరణ, విద్యుత్ మంత్రులు బుధవారం ఇక్కడ భేటీ అయ్యారు. మూడు రోజుల పాటు జరిగే ఈ భేటీలో కెనడాతో పాటు ఫ్రాన్స్, అమెరికా, బ్రిటన్, జర్మనీ, జపాన్, ఇటలీ దేశాల మంత్రులు స్థిరమైన ఆర్థికాభివృద్ధి సాధన, ప్లాస్టిక్ కాలుష్యం, ఇంథన భద్రత వంటి అంశాలపై కూడా చర్చించనున్నారు. గత జూన్లో చార్లెవాయిక్స్లో జరిగిన జి7 సదస్సులో సముద్ర ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, సముద్ర జీవుల వ్యర్థాల నిర్వహణతో కోస్తా, తీర ప్రాంతాలకు ముప్పు లేకుండా చూడాలన్న ఒప్పందంపై అమెరికా, జపాన్ తప్ప ఇతర దేశాల మంత్రులు సంతకాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జరుగుతున్న హాలిఫాక్స్ సదస్సుకు నార్వే, వియత్నాం, దక్షిణాఫ్రికా,కెన్యా, అర్జెంటీనా తదితర దేశాల ప్రతినిధులు కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు.