Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యావూండే : కామెరూన్ అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మరో రెండు వారాల్లో ఫలితాలు వెల్లడయ్యే అవకాశముందని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. కామెరూన్లో ఆదివారం అధ్యక్ష ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కొందరు వేర్పాటువాద కార్యకర్తలు యావూండేలో ఘర్షణలకు దిగారు. ఓటర్లను ఇబ్బందులకు గురిచేశారు. ఎట్టకేలకు ఎన్నికలు ముగిసి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. కాగా, కామెరూన్లో జరిగిన అధ్యక్ష ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగాయని స్థానిక నేత బియా అభిప్రాయపడ్డారు. ఓట్ల లెక్కింపును పారదర్శకంగా నిర్వహించాలని ప్రధాన ప్రతిపక్షనేత సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ అభ్యర్థి జోషువా ఓసిV్ా డిమాండ్ చేశారు. ఉగ్రదాడుల నిర్మూలనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నార్త్వెస్ట్ రీజియన్ గవర్నర్ డెబెన్ టెకోఫో అన్నారు. ఎన్నికల నిర్వహణలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నించిన ఇద్దరు మిలిటెంట్లను కామెరూన్ బలగాలు కాల్చి చంపాయని అన్నారు. కామెరూన్ పరిసర ప్రాంతాల్లో బొకోహరామ్ మిలిటెంట్లు ఉనికి కోసం ప్రయత్నిస్తున్నారని, పలు ఓటింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సామాగ్రికి నిప్పంటించారని అన్నారు. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు చేరుకోకుండా భయబ్రాంతులకు గురిచేశారని అన్నారు.