Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబూల్ : అఫ్ఘనిస్తాన్లో త్వరలో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరించాలని తాలిబన్లు పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఓటర్లను హెచ్చరిస్తున్నారు. అఫ్ఘాన్ ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా లేమని వెల్లడించారు. అంతేగాకుండా, అఫ్ఘాన్ భూభాగంలో మోహరించిన విదేశీ బలగాలను తక్షణమే వెనక్కి పంపాలని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ పార్లమెంట్ ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించినట్టయితే ఆత్మాహుతి దాడులకు పాల్పడతామంటూ తాలిబన్లు హెచ్చరించారు.
సోమవారం తాలిబన్ల ప్రతినిధి ఖలీజాద్ అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ కార్యాలయానికి తమ డిమాండ్ల పత్రాన్ని అందజేశారు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.