Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రద్ధ చూపడంలో సర్కార్తీరు అధ్వాన్నం
- ఆక్స్ఫామ్ నివేదికలో వెల్లడి
లండన్:సమాజంలోని అసమానత్వాన్ని తొలగించడంలో భారత్ అట్టడుగు స్థానానికి దిగజారింది. బ్రిటన్కు చెందిన దాతృత్వ సంస్థ ఆక్స్ఫామ్ 157 దేశాలను 'అసమానత్వాన్ని తగ్గించడంలో నిబద్ధత సూచీ'(సీఆర్ఐ) ప్రకారం విశ్లేషించగా, భారత్ 147వ స్థానంలో నిలిచింది. అంటే.. అట్టడుగు నుంచి 10వ స్థానంలో..ఆరోగ్యం, విద్య, సామా జిక భద్రతపై ప్రభుత్వం తక్కువగా ఖర్చు చేయడమే అందుకు కారణమని ఆక్స్ఫామ్ వివరించింది. మరోవైపు ప్రయివేట్ సెక్టార్కు రాయితీలు కల్పించడంలో భారత సర్కార్ ఎంతో శ్రద్ధ చూపుతున్నట్టు ఆక్స్ఫామ్ నివేదికలో దుయ్యబట్టారు. కార్మిక చట్టాలు, మహిళల హక్కుల విషయంలోనూ భారత్ నిర్వహణతీరు అధ్వాన్నంగా ఉన్నదని ఆక్స్ఫామ్ తెలిపింది. అసమానత్వాన్ని తగ్గించడంలో భారత సర్కార్ వ్యవహరిస్తున్నతీరు ఆందోళన కలిగిస్తోందని ఆక్స్ఫామ్ మండిపడింది. సీఆర్ఐ ప్రకారం డెన్మార్క్ ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలువగా, ఆసియా దేశాల్లో జపాన్ మొదటి స్థానంలో(మొత్తమ్మీద 11వ స్థానంలో) నిలిచింది. మొత్తమ్మీద అసమానత్వాన్ని తగ్గించడంలో భారత్, నైజీరియా, ధనిక దేశాల్లో అమెరికా తీరు అధ్వాన్నంగా ఉన్నట్టు ఆక్స్ఫామ్ నివేదిక పేర్కొన్నది.
దక్షిణ కొరియా, ఉరుగ్వే, నమీబియా దేశాలు అసమానత్వాన్ని తగ్గించడంలో గట్టి చర్యలు చేపట్టినట్టు ఆక్స్ఫామ్ కొనియాడింది. పన్నులు వసూలు చేయడం, సామాజిక భద్రత కల్పించడం, కార్మికుల హక్కులు కాపాడటంలో మెరుగ్గా వ్యవహరించిన దేశాలకు మంచి ర్యాంకులిచ్చినట్టు ఆక్స్ఫామ్ తెలిపింది.