Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉగ్రవాదంపై పోరులో దేశాలకు భారత్ విజ్ఞప్తి
న్యూయార్క్ : సంకుచితమైన ప్రాంతీయ రాజకీయ ప్రయోజనాలను అధిగమించాలని ఐక్యరాజ్యసమితిని భారత్ కోరింది. తాము ప్రతిపాదించిన అంతర్జాతీయ తీవ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని (సీసీఐటీ) ఆమోదించాలని విజ్ఞప్తి చేసింది. ' ప్రపంచ దేశాలను కంటిమీద కునుకులేకుండా ఉగ్రవాదం పీడిస్తోంది. ఇది ఆందోళన చెందాల్సిన అంశం. దీనిపై సమర్ధవంతమైన అంతర్జాతీయ పరస్పర సహకారం ఉండాల్సిన అవసరం ఉంది' అని పార్లమెంట్ సభ్యుడు. పీడీ రారు చట్టపరమైన వ్యవహారాలను చూసే జనరల్ అసెంబ్లీ కమిటీకి తెలిపారు. అయితే సంకుచితమైన ప్రాంతీయ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ అంశంపై చట్టం తీసుకురావడమనేది కుదుపులకు గురవుతునే ఉందని అన్నారు.
కీలకమైన ఈ అంశంపై పురోగతిని అడ్డుకునేందుకు ఐరాస వేదికతో సహా పలు వేదికలపై తెర వెనుక రాజకీయాలు నడవడం విచారకరమని సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్కి చెందిన ఏకైక పార్లమెంట్ సభ్యుడు రారు వ్యాఖ్యానించారు.