Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికన్ శాస్త్రవేత్త మరణానంతరం వెలుగులోకి..
వాషింగ్టన్: అమెరికన్ ప్రసిద్ధ ఫిజిక్స్ శాస్త్రజ్ఞుడు లియోన్ లెడర్మన్ తన జీవితపు చరమాంకంలో వైద్య ఖర్చులకోసం తాను పొందిన నోబెల్ అవార్డునే అమ్ముకోవాల్సి వచ్చింది. లెడర్మన్కు ఈ అగత్యం ఏర్పడిందనే విషయం తాజాగా వెలుగుచూసింది. ఆయన ఈ నెల 3న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ప్రపంచంలో ధనికదేశమైన అమెరికాలో వైద్య సేవల వైఫల్యాన్ని ఈ విషయం స్పష్టం చేస్తున్నది. 'గాడ్ పార్టికల్'ను కనుగొన్న లెడర్మన్ తన వృద్ధాప్యంలో మెదడు సంబంధిత వ్యాధి బారిన పడటంతో 24 గంటల వైద్య సేవల అవసరం ఏర్పడింది. హఠాత్తుగా ఎదురైన ఈ సమస్యనుంచి గట్టెక్కడానికి లెడర్మన్ కుటుంబం ఆయన పొందిన నోబెల్ అవార్డును అమ్మేయాల్సి వచ్చింది. తన భర్త ఆరోగ్యం క్షీణిస్తున్నా ఆయన్ను ప్రశాంతంగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని లెడర్మన్ భార్య తెలిపారు. దేశ పౌరులకు వైద్య సేవలందించలేని ధనిక దేశాల్లో అమెరికా మాత్రమే నిలుస్తుంది. లాభార్జన ధ్యేయంగా ప్రస్తుతం ఏర్పడిన వైద్య సేవల వ్యవస్థ వల్ల అమెరికా.. ఆర్థిక సంక్షోభంతోపాటు సామాజిక సంక్షోభాన్నీ ఎదుర్కొంటున్న విషయాన్ని ఈ ఘటన స్పష్టం చేస్తోంది. 1988లో ఫిజిక్స్ శాస్త్ర విభాగంలో లెడర్మన్ నోబెల్ అవార్డును పొందారు.