Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 55 మంది మృతి
అబూజ : నైజీరియాలో కదూనా రాష్ట్రంలోని మార్కెట్లో చెలరేగిన అల్లర్లలో 55 మంది మృతి చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధ్యక్ష కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం...నైజీరియా మార్కెట్లో రెండు వర్గాల మధ్య భీకర అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లు హింసాత్మకంగా మారడంతో 55 మంది అక్కడికక్కడే మృతి చెందారు. రెండు వర్గాలకు చెం దిన ప్రజలు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. మారణాయుధాలతో పరస్పర దాడులకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘట నాస్థలికి చేరుకొని అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో 22 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రెండు వర్గాల మధ్య చెల రగిన వాగ్వాదమే ఘర్షణకు దారితీసిందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.