Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరూలో ప్రారంభమైన రిఫరెండమ్
- దేశ వ్యాప్తంగా 5,398 పోలింగ్ కేంద్రా
లులిమా : దేశాన్ని పట్టిపీడిస్తున్న అవినీతిని పారద్రోలాలని పెరూ సంచలన నిర్ణయం తీసుకుంది. సమాజ పురోగతికి అవరోధంగా మారిన అవినీతిని అంతమొందిస్తేనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడింది. అవినీతిపై తిరుగుబావుట ఎగురవేయాలని నిర్ణయించుకుంది. అవినీతి నిర్మూలనకు అనుకూలంగా ఎంతమంది పౌరులు మద్దతిస్తారో తెలుసుకునేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఆదివారం నిర్వహించిన ఈ రిఫరెండమ్లో అవినీతి నిర్మూలనకు అనుకూలంగా ఎంత మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారో సోమవారం తెలియనుంది. దేశ వ్యాప్తంగా 5,398 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు పెరూ ప్రభుత్వం పేర్కొంది. పెరూ రాజకీయనేతలు, అధికారులు,న్యాయమూర్తులు కూడా అవినీతికి పాల్పడుతున్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా, పెరూలో ఇటీవల చోటుచేసుకున్న ఓద్బ్రెచ్డ్ కుంభకోణం లాటిన్ అమెరికా దేశాల్లోనే అతిపెద్ద స్కామ్. ఈ కుంభకోణంలో ప్రముఖ రాజకీయనేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అవినీతి ఆరోపణల కారణంగా పెరూ అధ్యక్షుడు పెడ్రో పాబ్లో తన పదవికి రాజీనామా చేసి వైదొలిగారు. కీలక నేత అలన్ గార్సియా ఓ మెట్రో కంపెనీ నుంచి ముడుపులు స్వీకరించినట్టు తేలడంతో జైలు శిక్ష అనుభవిస్తున్నారు.