Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాషింగ్టన్: ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ కేసులో దోషిగా తేలిన ప్రవాస భారతీయుడికి అమెరికా కోర్టు తొమ్మిదేండ్ల జైలుశిక్ష విధించింది. శిక్షా కాలం పూర్తయిన అనంతరం అతన్ని భారత్కు పంపించాలని డెట్రాయిట్ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ప్రాసిక్యూషన్ వెల్లడించిన వివరాల ప్రకారం...భారత్లోని తమిళనాడు రాష్ట్రానికి చెందిన టెక్కీ ప్రభూ రామ్మూరి(35) అమెరికాలో ప్రవాస ముంటున్నారు. 2015లో హెచ్-1బీ వీసాపై అమెరికాకు వచ్చాడు. ఈఏడాది జనవరి3న స్పిరిట్ ఎయిర్లైన్స్ విమానంలో భార్యతో పాటు లాస్ వేగస్ నుంచి డెట్రాయిట్ ప్రయాణించాడు. ప్రయాణ సమయంలో ఆయనకు,భార్యకు వేర్వేరు చోట్ల సీట్లు లభించాయి. రామ్మూర్తి విమానంలో నిద్రిస్తున్న22 ఏండ్ల మహిళపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈకేసులో నిందితుడిపై మోపిన అభియోగాలు రుజువయ్యాయి. నిందితునికి 9 ఏండ్ల జైలుశిక్ష విధించినట్టు డెట్రాయిట్ న్యాయమూర్తి టెర్రెన్స్ బెర్గే తీర్పు వెలువరించారు.